రీఛార్జ్‌కి డబ్బులు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య

by Nagaya |   ( Updated:2022-12-14 05:45:48.0  )
రీఛార్జ్‌కి డబ్బులు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య
X

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి సురేందర్(24) అనే యువకుడు పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల కాపరిగా ఉండే యడ్లపల్లి సురేందర్ సోమవారం తన మొబైల్ ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయించుకునేందుకు తల్లిని డబ్బులు అడిగాడు. కూలి డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తానని తల్లి చెప్పడంతో మనస్థాపం చెంది అదే రోజు రాత్రి పురుగుల మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబీకులు హుటాహుటిన అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బుధవారం కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డ యడ్లపల్లి సురేంద్రకు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది.

Also Read....

వరంగల్‌లో దారుణం.. తల్లిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు..

Advertisement

Next Story

Most Viewed